గండిపేట, వెలుగు: తక్కువ ధరకే ఆపిల్ ఫోన్లు, వాచీలు ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్కు చెందిన హరినాథ్ అనే వ్యక్తి ఈ నెల 26న కిషన్గూడ బ్రిడ్జి వద్ద ఉండగా, స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద తక్కువ ధరకే ఆపిల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని నమ్మబలికారు.
వారి మాటలు నమ్మి హరినాథ్ మొత్తం రూ. 51 వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. తీరా వస్తువులను పరిశీలించగా, అవి నకిలీవని తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముఠాలోని ఆరుగురు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. విచారణలో వారు ఆర్జీఐ ఎయిర్పోర్ట్, పహాడీ షరీఫ్, మొఘల్పురా పరిధుల్లో మరో ఆరు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి 2 నకిలీ ఆపిల్ ఫోన్లు, 14 డూప్లికేట్ ఇయర్పాడ్స్, 14 వాచీలు, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.

